ఈ ఎస్ ఐ స్కాం : వెలుగులోకి కొత్త కోణాలు?

-

ఈ ఎస్ ఐ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి  వ్యాపారాలు చేసినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది.  ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేరు మీద ముకుందరెడ్డి వ్యాపారాలు చేసినట్లు సమాచారం. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. తక్కువ ధరకు దొరికే పరికరాలు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టినట్లు గుర్తించారు.

దేవికారాణి,  ముకుంద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  శ్రీహరి బాబులు కలిసి ఈ స్కాంకు పాల్పడినట్లు ఈడి నిర్ధారణకు వచ్చింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు పెద్ద మొత్తంలో మళ్లించినట్లుగా నిర్ధారణకు వచ్చింది. పలు ఫార్మా కంపెనీలతో పాటుగా రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా గ్యాంగ్ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దేవికారాణి ఏకంగా గా తమిళనాడు కర్ణాటక ఆంధ్ర లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని, పిఎంజె జూవెల్స్ లో పెద్ద మొత్తంలో దేవికారాణి నగలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆస్తులతో పాటు నగలు కొనుగోలు మొత్తం హవాలా ద్వారా చెల్లింపులు జరిపినట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news