బ్రేకింగ్ : చత్తీస్ గఢ్ లో మరో ఎన్కౌంటర్, మావోయిస్ట్ మృతి !

-

మొన్న చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది, గదాం- జంగంపాల్ అటవీప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వెట్టి హ్యూంగా అనే  మావోయిస్టు మృతి చెందాడు. అతని మీద లక్ష రివార్డ్ ఉందని అంటున్నారు.

సంఘటన స్థలంలో 2 కిలోల ఐఈడీ ,8 ఎం ఎం పిస్టల్ ,తుపాకీ,సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో పక్క చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మినగాచల్ నదిలో నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగలబెట్టినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news