రైతులకు తెలంగాణ సర్కార్ పండుగ గిఫ్ట్..!

-

తెలంగాణ సర్కార్ రైతులకు చేయూత అందించే విధంగా రైతు వేదికలు నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే దసరా పండక్కి కేసీఆర్ సర్కార్ రైతులందరికీ శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ రైతు వేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్ దసరా నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పలు రకాల రైతు వేదికలను పర్యవేక్షించడం తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో రైతు వేదికల నిర్మాణం ఎంత వరకు వచ్చాయి అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి రైతు వేదికలను పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా నాటికి ప్రభుత్వం అనుకున్న విధంగా రైతు వేదికలు పూర్తయితే రైతులకు అది దసరా గిఫ్ట్ గా మారబోతుంది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news