వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

-

తెలంగాణ ప్రభుత్వం వాహన దారులకు మరో సారి అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్ చలానాలపై డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లపై రాయితీ అమల్లోకి ఉంటుంది. ఆ తేదీల్లోపు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న చలాన్లకు 90 శాతం డిస్కౌంట్ కాగా.. టూ వీలర్స్ కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం,  భారీ వాహనాలకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే వాహనదారులు ఈ చలాన్లను డిస్కౌంట్ తో ఆన్లైన్ లేదా మీసేవ సెంటర్లలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. 2022 మార్చిలోనూ చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చి వసూలు చేశారు పోలీసులు. ఆ సమయంలో మొత్తం రూ.300 కోట్లు వసూలు అవ్వడం విశేషం. అయితే.. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు మళ్లీ డబ్బులు వసూలు కాలేదు. ప్రస్తుతం 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా చలాన్లను క్లీయర్ చేయడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది పోలీస్ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news