యాదాద్రికి తెలంగాణ గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై నేడు యాదాద్రికి వెళ్ళనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.

కాగా 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 28న జరగనున్న తిరు కళ్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

కాగా, గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్‌ సర్కార్‌ మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై విభేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ… ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వారు మళ్లీ కాస్త కలిసినట్లుగా చేశారు. అయినప్పటికీ… వీరి మధ్య అదే గ్యాప్‌ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news