మరోసారి హైదరాబాద్‌కు అమిత్ షా..తెలంగాణలో అధికారమే టార్గెట్ !

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే మునుగోడుపై ఎలాగైనా గెలవాలని.. ప్లాన్‌ చేస్తున్న బీజేపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 17న పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించాలని బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది.

పెరేడ్ గ్రౌండ్ లోనే ఈ కార్యక్రమం నిర్వహించి.. సక్సెస్‌ చేయాలని అనుకుంటోంది. కేంద్ర హోం శాఖ పరిధిలోని సాయుధ దళాలతో ఈ పెరేడ్ నిర్వహించాలని.. సెప్టెంబర్‌ 17వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, మహా రాష్ట్ర , కర్ణాటక సీఎంలు హాజరు కానున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version