షాకింగ్ : తెలంగాణలో నాలుగురోజుల్లో 203 మంది మిస్సింగ్ !

-

తెలంగాణలో రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్న విషయం సంచలనంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు పెరుగుతూ పోయి గత నాలుగురోజుల్లో తెలంగాణలో 203 మంది అదృశ్యం కేసులు నమోదయినట్టు చెబుతున్నారు. పోలీసు శాఖ అధికారిక వైబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల వివరాలు నమోదయినట్టు చెబుతున్నారు. మొన్న ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65మంది అదృశ్యం అయినట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తమ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

 

అలానే మొన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అలానే ఈనెల 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు, నిన్న 11 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు వెబ్‌సైట్‌లో వెల్లదించారు. వివిధ కారణాలతో, ఒత్తిళ్ళతోనే ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు దాని మీద వర్క్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news