TSRTCలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

-

ఆదాయం పెంచుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్గో పార్శిళ్లు, వాటర్ బాటిళ్ల విక్రయం మొదలుపెట్టిన ఆర్టీసీ యాజమాన్యం తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదే ‘ఏఎం 2 పీఎం’ ఎక్స్​ప్రెస్ సర్వీసు. శుక్రవారం రోజున ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ సేవలను ప్రారంభించారు.

‘మధ్యాహ్నం 12 గంటల లోపు పార్సిల్‌ బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు గమ్యస్థానానికి చేరుస్తాం. రాత్రి 9 గంటలలోపు బుక్‌ చేసుకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా చేరవేస్తాం. ‘ఏఎం 2 పీఎం’ పేరుతో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసులను ప్రారంభించాం. తెలంగాణలో 99 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలో ఇతరరాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

‘ప్రస్తుతానికి ఒక కిలో బరువు ఉన్న పార్సిళ్లను మాత్రమే అనుమతిస్తాం. ఆ పార్సిల్‌ విలువ కూడా రూ.5 వేలకు మించి ఉండకూడదు. ఒక్కో పార్సిల్‌కు రూ.99 వసూలు చేస్తాం. తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ నగరాలకు అయిదు కిలోల బరువున్న పార్సిళ్లను చేరవేస్తాం.’ అని సజ్జనార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news