కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని.. దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు.

మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.  పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news