మహిళలకు TSRTC అలర్ట్… బస్సులో ప్రయాణించాలంటే రేపటి నుండి ఇవి తప్పనిసరి..

-

ఇటీవల ఎన్నికల్లో గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు రేపటినుండి జీరో టికెట్ అమలు చేయబోతున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ తెలిపాడు. ఇకపై మహిళలు వారి యొక్క ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా గుర్తింపు కార్డుని చూయించి జీరో టికెట్ను తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ అంశంపై ఈరోజు అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించాడు.

 

ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనర్ మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన వస్తుందని అన్నాడు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అమలు చేసిన ఈ పథకాన్ని మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశాడు.ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ స్కీం ప్రశాంతంగా కొనసాగించబడుతుందని తెలిపాడు. ఈ పథకాన్ని సమర్థవంతంగా నడపడానికి సాఫ్ట్వేర్ను సంస్థ అప్డేట్ చేసిందని వెల్లడించాడు. ఈ సమావేశంలో tsrtc సిఓఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఐటి ఏటీఎం రాజశేఖర్, సిటిఎం జీవన్ ప్రసాద్ .. తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news