మందుబాబులకు షాక్.. మద్యం తాగి వాహనాలు నడిపిన 212 మంది అరెస్టు

-

వీకెండ్ రాగానే హైదరాబాద్లో యువత పబ్లు, పార్టీలంటూ రచ్చ రచ్చ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఫూటుగా తాగి కొందరు మైకంలోనే వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి మందుబాబులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరఢా ఝుళిపించారు. వారాంతాల్లో మద్యం తాగి రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు ముమ్మరం చేశారు.

నగరంలో శుక్ర, శని వారాల్లో రాత్రి విస్తృతంగా సోదాలు చేసి తాగిన మైకంలో వాహనాలు నడిపిన 212 మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. వారిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో ద్విచక్ర వాహన దారులే అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. 165 మంది బైకర్లు, 34 మంది కార్లు తదితర నాలుగు చక్ర వాహనాలు, ముగ్గురు భారీ వాహన డ్రైవర్ల తోపాటు పదిమంది మద్య మత్తులో ఆటోలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. ఇక అందులో 21 మంది స్పృహ కూడా లేనంతగా మత్తులో ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news