హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్..నేటి నుంచి 22 MMTS రైళ్లు రద్దు

-

హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి 22 MMTS రైళ్లు రద్దు కానున్నాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 23 వరకు 22 MMTS రైళ్లు రద్దు కానున్నాయి. వీటిలో హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు ఉన్నాయి. లింగంపల్లి-ఫలక్నుమా మార్గంలో మరో 10 సర్వీసులు ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

కాగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి TSRTC తీపి కబురు అందించింది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించే వారిలో కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే…టికెట్ చార్జీలో 10% డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. క్యాబ్, ఆటోల నుంచి ఎదురయ్య పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version