హైదరాబాద్‌ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి 22 MMTS రైళ్లు రద్దు

-

హైదరాబాద్‌ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌. రేపటి నుంచి 22 MMTS రైళ్లు రద్దు కానున్నాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రేపటి నుంచి ఈనెల 23 వరకు 22MMTS రైళ్ళు రద్దుకానున్నాయి. వీటిలో హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు ఉన్నాయి.

లింగంపల్లి మార్గంలో మరో 10 సర్వీసులు ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇవాళ, రేపు మద్యం షాపులను క్లోజ్ చేయనుంది సర్కార్. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే 17వ తేదీ, 18 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news