60 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం..మందులు ఇప్పిస్తానని చెప్పి..

-

దేశంలో రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన కామాంధులలో మార్పు రావడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా వయసుతో సంబంధం లేకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య సమస్యలతో మందుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ రోగులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోగుల వెయిటింగ్ హాల్ లోనే బెంచీపై పడుకుంది.

అక్కడికి ఏదో పని మీద వచ్చిన 23 ఏళ్ల యువకుడు వృద్ధురాలి నిస్సహాయ స్థితిని గమనించి మందులు ఇప్పిస్తానని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలి కేకలు ఎవరికీ వినిపించలేదు. ఘటన అనంతరం యువకుడు అక్కడినుంచి పారిపోయాడు. కాసేపటికే అక్కడికి వచ్చిన కొందరితో ఆమె జరిగిన విషయాన్ని వారితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితురాలి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని పట్టుకొని కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news