వచ్చే ఎన్నికల్లో 75 సీట్లు పక్కా – కోమటిరెడ్డి

-

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరిద్దరినీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తంకుమార్, రేణుకా చౌదరి తదితరులు ఉన్నారు.

ఇక ఈ భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇది నిజం అనేందుకు చేరికలే నిరూపణ అని అన్నారు. వచ్చే ఎన్నికలలో తమకు 75 సీట్లు పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్త నేతల చేరికలను స్వాగతిస్తున్నామని తెలిపారు. తాము చేసేదే చెబుతామని.. చెప్పింది తప్పక చేస్తామని అన్నారు. కర్ణాటక తరహాలో షార్ట్ అండ్ స్వీట్ మ్యానిఫెస్టోతో ప్రజలలోకి వెళతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news