ఎమ్మెల్యే సీతక్క: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి…

-

తెలంగాణాలో ఒక్కసారిగా కాంగ్రెస్ హైలైట్ గా మారుతోంది. అటు అధికార పార్టీలో అసంతృప్త నాయకులకు మరియు బీజేపీలోని అసంతృప్త నాయకులకు చేరడానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటే అది కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పాలి. అందుకే జూపల్లి మరియు పొంగులేటి లు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు, అదే విధంగా ఈటల మరియు రాజగోపాల్ రెడ్డి లు సైతం కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇలా పార్టీలో చేరికలు పెరుగుతుండడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క సంతోషాన్ని తెలిపింది. తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు అండదండగా ఉండాలన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు.

అంతే కాకుండా సీతక్క వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news