మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 900 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి : మంత్రి హరీష్

-

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది మంత్రులు వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు అభివృద్ధి కాలేద‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అభ‌వృద్ధి క‌ట్టుబ‌డి ఉందని అన్నారు. త్వ‌ర‌లోనే రూ. 200 కోట్ల నిధుల‌తో కొత్త‌గా 900 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. కాగ నేడు జిల్లాలోని బాలా న‌గ‌ర్ లో 30 ప‌డ‌క‌ల క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. అనంత‌రం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభివృద్ధిని విస్మ‌రించార‌ని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు చేసిన త‌ర్వాత సాగు నీటి లో జిల్లాను నెంబ‌ర్ వ‌న్ చేశామ‌ని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన త‌ర్వాతే.. మూడు మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో నీతి ఆయోగ్ ప్ర‌క‌టించిన ర్యాంక్ ల‌ల్లోనూ తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని అన్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రం అయిన ఉత్త‌ర ప్ర‌దేశ్ చివ‌రి స్థానంలో ఉంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news