హీరో నాగార్జున సోదరి నాగసుశీల పై కేసు నమోదు

-

టాలీవుడ్ హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

నాగ సుశీల.. శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్ నర్ చింతలపూడి శ్రీనివాస్ మధ్య గత కొద్ది సంవత్సరాలుగా భూవివాదాలున్నాయి. వీరిద్దరూ చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. తనకు తెలియకుండా శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో నాగసుశీల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లాకప్ లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకు తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని పేర్కొన్నారు. ఈ వివాదాల కారణంగా శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news