హైదరాబాద్‌ లో మరో దారుణం..యువకుల దాడి..పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ మృతి

-

హైదరాబాద్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. యువకుల దాడితో..పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ పరిధిలోని నార్సింగీ జన్వాడ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, జన్వాడ లోని HP పెట్రోల్ పంపు లో పంప్ బాయ్ పై ముగ్గురు యువకులు దాడి చేశారు.

స్వైప్ మిషన్ పని చేయడం లేదు…….క్యాష్ ఇవ్వమని అడిగిన పాపానికి రెచ్చిపోయి… పిడు గుద్దుల వర్షం కురిపించారు యువకులు. దీంతో అక్కడే కుప్ప కూలాడు పంపు బాయ్ సంజయ్. దీంతో హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు వైద్యులు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు… సిసి టివీ కెమరాలో రికార్డ్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version