తెలంగాణలో దారుణం.. ఓయో రూంలో బాలికను బంధించి.. 20 రోజులపాటు !

-

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం తెరపైకి వచ్చింది. ఓ యువతిని 20 రోజులు బంధించి… ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన బైంసాలో తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బైంసా ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా అంటే instagram ద్వారా… ఓ యువకుడు పరిచయం అయ్యాడు.

A man committed suicide in Oyo’s room

ఆ పరిచయం కాస్త… రిలేషన్షిప్ కు దారి చేసిందని సమాచారం. దీంతో నారాయణగూడ లోని ఓయో రూమ్ కు ఆ బాలికను తీసుకువెళ్లాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత 20 రోజుల పాటు అందులోనే బంధించి… రేప్ చేసినట్లు సమాచారం. అయితే ఆ బాలిక చాకచక్యంతో… తన లొకేషన్ ను కుటుంబ సభ్యులకు షేర్ చేసిందట. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు… బాలికను రక్షించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news