Telangana:వరద బాధితులకు శుభవార్త… ఒక్కో కుటుంబానికి..రూ.17,500 !

-

ఖమ్మంలోని వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి… 17,500 ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందట. మొదటగా ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అయితే ఆ డబ్బులు సరిపోవని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. దీంతో వరద బాధిత సహాయాన్ని… 17,500 రూపాయలకు పెంచి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇంటి మరమ్మత్తులు, బట్టలు కొనుక్కోవడానికి, ఇంటి సమాను కొనుక్కోవడానికి ఇలా లెక్కపెడితే 17,500 ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులు కూడా ఓ నిర్ణయానికి వచ్చారట. ఇక దీనిపై త్వరలోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని… పెంచిన పరిహారాన్ని ఇవ్వనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news