కుత్బుల్లాపూర్ లో దారుణం.. కారు ఢీ కొనడంతో గాలిలోకి ఎగిరి వ్యక్తి మృతి..!

-

నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు వేగంగా ఢీ కొట్టిన దారుణ ఘటన కుత్బుల్లాపూర్ లో  చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఈ  ప్రమాదానికి సంబందించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వివరాల్లోకి వెళ్లితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో  గోపి అనే వ్యక్తి  సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే అతను  రోడ్డు పక్క నుంచి  నడుచుకుంటూ తన విధులకు  వెళుతున్నాడు.

ఇంతలోనే అకస్మాత్తుగా చాలా వేగంగా దూసుకొచ్చిన కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో అతడు గాలిలో ఎగిరిపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఇందుకు సంబందించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో కారు నడుపుతున్నది స్టూడెంట్ మనీష్ గా పోలీసులు గుర్తించారు. అతడికి స్పల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.  ప్రమాదానికి మద్యం మత్తు, అతివేగమే  కారణమని భావిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version