కవితకు నోటీసుల పేరుతో కొత్త డ్రామా.. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కట్వకుంట్ల కవితకు ఈడీ మరొకసారి నోటీసులను జారీ చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నోటీసుల ద్వారా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందని.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. కవితకు నోటీసులు అంశంపై స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ది పొందేందుకే ఈడీ సమన్ల నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు.

ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని కానీ కీలకంగా ఉన్న కవితను మాత్రం అరెస్ట్ చేయకుండా కేసునే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తీరా లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల కోసం మరోసారి నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కవితపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలకు అవగాహన ఉందని.. గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహన తెలంగాణ ప్రజలకు అర్థం అయిందన్నారు. ఈ రెండు పార్టీల నాటకాలను ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news