ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష

-

ఇవాళ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన సమస్యలపై సమీక్ష జరుగనుంది. ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరుగుతుంది. ఈ తరుణంలోనే… అధికారులతో కలిసి భవన్ ప్రాంగణాన్ని సందర్శించనున్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి అపరిష్కృతంగా భవన్ విభజన అంశం ఉండిపోయింది.

A review on the division of the joint AP Bhawan in Delhi today
A review on the division of the joint AP Bhawan in Delhi today

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అపరిష్కృతంగా వివాదం ఉండిపోయింది. అయితే.. ఈ వివాదాన్ని పరిష్కరించి భవన్ ఆస్తులను పంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి నాటికి కొత్త తెలంగాణ భవన్‌కు శంఖుస్థాపన, ఏడాదిలోగా కొత్త భవన్ నిర్మాణం పూర్తిచేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రకటన చేశారు. కాగా… తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news