ఒక్క రేషన్ కార్డ్ తొలిగించిన ఊరుకునేది లేదు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

-

గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విచారణ చేయిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.. జలయజ్ఞo, ఇందిరమ్మ ఇండ్ల అంశంలో అవినీతిని బయట పెడతామని కెసిఆర్ ప్రకటించారు.. పదేళ్ల కెసిఆర్ పరిపాలనలో కెసిఆర్ గత కాంగ్రెస్ పాలనపై ఎలాంటి విచారణ చేపట్టలేదు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం కేసీఆర్ తరహాలోనే కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చాక కెసిఆర్ పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.. ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారు.. రాష్ర్ట పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోంది.. కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు.. లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలానే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో బస్సులు రాక, బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్క రేషన్ కార్డ్ తొలిగించిన ఊరుకునేది లేదు. ఉచిత ప్రయాణం హామికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదు.  రాష్ట్రంలో 850 కి పైన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.. అధికారులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదు. బస్సులు లేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నరు. 15000 కోట్ల అప్పు కోసం మొదటి నెలలోనే రేవంత్ ప్రభుత్వం పాకులాడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెపట్టడం లేదు..

Read more RELATED
Recommended to you

Latest news