కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ఏసీబీ యత్నం చేసిందట. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా-ఈ రేస్ కేసులో దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. అవసరమైతే మరోసారి విచారణకు రావలన్నారు అధికారులు. తాను సెల్ ఫోన్ తీసుకురాలేదన్నారు కేటీఆర్.

ఈ-రేస్ సమయంలో వాడిన సెల్ ఫోన్ ను ఈనెల 18లోపు సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాట్లాడారు. నోటీసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి భయపడేది లేదు.. మేము పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదని వెల్లడించారు.15 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతాడేమో తప్ప అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి పీకేదేమి లేదన్నారు.
–