ఏసీబీ వలలో ఏసీపీ ఉమామహేశ్వరరావు.. కళ్లు చెదిరే ఆస్తుల చిట్టా

-

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వర రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయణ్ను అదుపులోకి తీసుకుని ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులు, ఆయన సోదరుడితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి.

ఈ సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు ఉమామహేశ్వరరావును న్యాయస్థానంలో ప్రవేశపెడతామని, ఎఫ్‌ఎంసీజీ పెట్టుబడుల కేసులోనూ అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

 

ఏసీబీ బృందాలు మంగళవారం రాత్రి 9గంటల వరకు చేసిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు… మొత్తం రూ.37.5 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌ శివార్లు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఘట్‌కేసర్‌లో ఐదుచోట్ల, విశాఖపట్నం, చోడవరంలలో ఏడుచోట్ల, శామీర్‌పేట, మల్కాజిగిరి, కూకట్‌పల్లిల్లో ఒక్కోటి చొప్పున స్థలాలు, శామీర్‌పేటలో ఖరీదైన విల్లా ఉన్నట్లు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. దర్యాప్తు ముగిస్తే ఆస్తుల చిట్టా పెరిగే అవకాశముందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version