Telangana: సీసీటీవీ ఫుటేజ్.. అతివేగానికి యువకుడు బలి

-

అతివేగానికి యువకుడు బలి అయ్యాడు. దీనికి సంభందించిన సీసీటీవీ ఫుటేజ్.. వైరల్ గా మారింది. ఈ సంఘటన గజ్వేల్ లోని ప్రజ్ఞపూర్‌ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. గజ్వేల్ లోని ప్రజ్ఞపూర్‌ కు చెందిన శ్రావణ్(18) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, అతివేగంతో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ డీకొట్టింది.

సీసీటీవీ ఫుటేజ్.. అతివేగానికి యువకుడు బలి

ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న శ్రావణ్ ఎగిరి డివైడర్‌పై పడడంతో తలకు బలమైన గాయాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఈ విషయం తెలియగానే… రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ తో గుద్దిన వ్యక్తికి కూడా భారీగానే గాయాలు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ బైక్ రైడర్ తాగి నడిపినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news