కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. మోటర్లకు మీటర్లకు పెడతాం – అద్దంకి దయాకర్

-

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. మోటర్లకు మీటర్లకు పెడతామని… రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి మొన్న ఉచిత కరెంట్‌ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక ఇదే విషయంపై ఓ ఛానల్‌ చర్చ లో కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ పాల్గొని..వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలని అన్నారు. రైతులు ఎక్కువ మొత్తంలో కరెంట్ వినియోగం చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత మోటర్లకు మీటర్లకు పెడతామని పేర్కొన్నారు. అందుకు అయ్యే ఖర్చు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు అద్దంకి దయాకర్. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news