వైసీపీ నేతలు అందరికీ న్యాయం చేస్తా – విజయసాయిరెడ్డి

-

వైసీపీ పార్టీలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చి అవకాశాలు కల్పించారన్నారు. వివిధ నియోజకవర్గాలలో పదవులురాని ఒకరిద్దరి నాయకులకు కూడా న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుందని వివరించారు.

తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను కలుసుకుని వారి నుండి వినతులు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అందరికీ న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news