ఉప ఎన్నికలు వస్తే BRS అడ్రస్ లేకుండా చేస్తాం : ఆది శ్రీనివాస్

-

కేటీఆర్.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆ నాడు ప్రగతి భవన్ లో ఎమ్మెల్యే లకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెధవ ఎవరు.. ఆ నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు.. ఆ నాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్ కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు.. రోజుకో ఎమ్మెల్యే ను చేర్చుకుని చివరకు విలీనం అంటు పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.

పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెపుతావా.  తెలంగాణలో సిగ్గు, లజ్జ, మర్యాద లేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి. మీ ఫిరాయింపుల భాగోతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేటీఆర్ నీ సుద్దపూస ముచ్చట్లు ఆపు. లోక్ సభ ఎన్నికల్లో జీరో చేసినా నీకు, నీ అయ్య కు బుద్ధి రాలేదు. తెలంగాణలో నీకు నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నావు.. ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో నువ్వు చేసింది ఏమిటి.. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్ లో చిత్తు చిత్తు చేశాం. కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిన్ను అడ్రస్ లేకుండా చేశాం. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే నిన్ను, నీ పార్టీ ని అడ్రస్ లేకుండా చేస్తాం అని ఆది శ్రీనివాస్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version