హాస్టల్లో చేరిన 5 రోజుల్లోనే అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏమైందంటే?

-

నిజామాబాద్ జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలోని హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.శుక్రవారం రాత్రి యువతి సూసైడ్ చేసుకోగా శనివారం ఉదయం తోటి విద్యార్థినిలు గమనించి కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగావత్ రక్షిత ఐదు రోజుల కిందటే కాలేజీలోని వసతి గృహంలో జాయిన్ అయ్యింది.అయితే, రక్షిత ఎవరూ లేని సమయంలో కాలేజీ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థలు ఇచ్చిన సమాచారంతో కాలేజీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తోటి విద్యార్థులు, కాలేజీ అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా, విద్యార్థిని మృతికి ఏదైనా అనారోగ్య సమస్యలే కారణమా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news