BRS లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో ‘వనమా’లే – వైఎస్ షర్మిల

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో ‘వనమా’లేనని ఆరోపించారు. అంతా ఎన్నికల కమీషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లేనని అన్నారు షర్మిల. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే.. దాచింది కొండంత అని అన్నారు.

లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం అని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news