హైదరాబాద్‌-విజయవాడకు ప్రత్యామ్నాయ రైల్వే మార్గం

-

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే తక్కువ సమయంలో నగరం నుంచి విజయవాడ చేరుకునే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. దూరం తక్కువగా ఉండేలా హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక, ప్రత్యామ్నాయ రైల్వే మార్గం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో కీలకంగా ఉన్న మోటుమర్రి – విష్ణుపురం సింగిల్‌ రైల్వే లైన్‌ (88.81 కి.మీ.)ను డబుల్‌ లైన్‌గా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి అధ్యక్షతన దిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.1,746.20 కోట్లుగా నిర్ణయించింది. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌-విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతోపాటు దగ్గరి దారి అవుతుందని కేంద్రం తెలిపింది. ఈ డబ్లింగ్‌ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కి.మీ. మేర రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టు రానుంది. కింద ఒక రైలు వెళుతుంటే దానిపై వంతెన నుంచి మరొకటి వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news