సెటిల్మెంట్ల కోసమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు – కౌశిక్ రెడ్డి

-

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు గవర్నమెంట్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈటెల రాజేందర్ – రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేశారని, ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడని ఆనాడు తాను చెప్పానంటూ కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై ఈటెల ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

వేమ్ నరేందర్ కొడుకు పెళ్లిలో హుజురాబాద్ ఎన్నికల డీల్ కుదుర్చుకుంది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఇక తెలంగాణ బిజెపి నేతల సెటిల్మెంట్ల కోసమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. అమిత్ షా వరుస టూర్ల వెనుక ఆర్థిక లాభాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ బిజెపిలో కీలక నేతలు అయిన ఈటెల రాజేందర్, వివేక్ వెంకటస్వామి మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాల సెటిల్మెంట్ల కోసమే చేవెళ్ల సభకు అమిత్ షా వస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version