ఈ నెల 12న సంగారెడ్డికి అమిత్‌షా

-

బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

ఇందుకోసం 11వ తేదీన హైదరాబాద్ వచ్చి… ఓ అధికారిక కార్యక్రమానికి హాజరుకానున్నారు అమిత్ షా. 12వ తేదీన సంగారెడ్డి లో జరిగే మేధావుల సమావేశం కోసం ఏకంగా రెండు వేల మంది వచ్చేలా బిజెపి ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఈ మేధావుల సభ హైదరాబాదులో జరగాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం లో సంగారెడ్డికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news