హైదరాబాద్‌ లో మరోసారి బుల్లెట్ కలకలం..మహిళకు గాయాలు

-

హైదరాబాద్‌ లో మరోసారి బుల్లెట్ కలకలం రేపింది.. హైదరాబాద్‌ లోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో మరొకసారి బుల్లెట్ కలకలం రేపింది. ఈ తరుణంలోనే… జనావాసాల్లోకి తీసుకొని వచ్చిన బుల్లెట్ మహిళకు తాకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘట నార్సింగీ గంధంగూడ లో జరిగింది. ఓ ఇంట్లోకి ఉన్న మహిళ కాలులోకి దూసుకొని వెళ్లింది ఆ బులెట్.

Another bullet caused a stir in the army firing range

దీంతో మహిళకు గాయాలు కావడంతో ఇంట్లోనే కుప్పకూలింది. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్పాట్ కు చేరుకున్న నార్సింగీ పోలీసులు… దీనిపై విచారణ చేపడుతున్నారు. ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు రికార్డుల్లో రాసుకున్నారు. అయితే… ఈ నెలలోనే ఇది రెండవ సారి ఇలాంటి ఘటనే జరిగింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news