మరో పరువు హత్య.. కూతురు గొంతు కోసి చంపిన తండ్రి

-

సమాజంలో కొంత మంది కుల,మతాల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. మనుషుల ప్రాణాల కంటే కుల,మతాల కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను హతమారుస్తున్నారు. పరువు కోసం కన్న కూతురు, కొడుకు అని కుడా చూడకుండా చంపేస్తున్నారు. పరువు పేరుతో కన్నబిడ్డలనే కడతేర్చుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడు ఓ తండ్రి.

వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో గొంతు కోసి చంపేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని పెంచిన చేతులతోనే చంపేశాడు. నార్నూరు మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన షేక్ ఆలిం ను ప్రేమించింది. అయితే పెళ్లికి రాజేశ్వరీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరు మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. దీంతో రాజేశ్వరి తండ్రి గ్రామంలో పంచాయతీ పెట్టాడు. కొద్దిరోజుల వరకు విడివిడిగా ఉండాలని పెద్దలు చెప్పడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

నిన్న ఉదయం పెళ్లి విషయంలో రాజేశ్వరికి, ఆమె తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. షేక్ అలిం ను మరిచి పోవాలని దేవదాస్… కూతురు రాజేశ్వరి ని హెచ్చరించాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. విచారణలో దేవదాసు నేరం అంగీకరించడంతో నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news