తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రైల్వే లైన్ అందుబాటులోకి రాబోతోంది. కృష్ణ – వికారాబాద్ కొత్త రైల్వే లైన్ తుది సర్వే పూర్తయింది. సుమారు 122 కిలోమీటర్ల ఈ మార్గం, రూ. 2,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ లైన్లను నిర్మించనున్నారు.

దీనికి సంబంధించిన DPR ఈ నెలాఖరుకు రైల్వే బోర్డుకు చేరుకోనుంది. కృష్ణ – వికారాబాద్ మార్గం పూర్తయితే హైదరాబాద్ – గోవా మధ్య దూరం 35-40 కిలోమీటర్లు తగ్గుతుంది. దీంతో గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే వారు చేరుకోవచ్చని సంబరాలు చేసుకుంటున్నారు.