రేవంత్ సర్కార్ పై హరీశ్ రావు మరో సంచలన ట్వీట్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది కొన్నింటిని పాజిటివ్ అంటుండటం.. మరికొందరూ కొన్నింటిని నెగిటివ్ అనడం పరిపాటిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు.. ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ సర్కారుపై సంచలన ట్వీట్ వేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో తాగు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సంగారెడ్డి, వట్ పల్లి మండలం మేడికుండా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల విష జ్వరాలు వచ్చి జనాలు ఆసుపత్రి పాలవుతున్నారు. మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news