మరో సారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

-

సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ప్రకటించిన సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఎమ్మెల్యేగా నర్సాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను అని మదన్ రెడ్డి చెప్పారు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీని పటిష్టం చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకుల మనోభావాలను పార్టీ కూడా గుర్తించాలని గతంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.
మరో సారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

మరో సారి హాట్ కామెంట్స్ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. నర్సాపూర్ సీటు పెండింగ్ లో పెట్టడం నాకే కాదు BRS పార్టీకే అవమానకరం అన్నారు. కచ్చితంగా నర్సాపూర్ నుంచి పోటీలో ఉంటాను. నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాకు నామినేటెడ్ పోస్టులు అవసరం లేదు..నేను ప్రజల మధ్య ఉండే నాయకుడిని. ఇక్కడున్న వారికి నామినేటేడ్ పోస్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎం చేయండి నాకు ఇబ్బంది లేదు అన్నారు. నాకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు. త్వరలో 20 వేల మందితో భారీ బహిరంగ సభ పెడుతా నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. నేనేం ఇసుక దందాలు చెయ్యలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news