తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఈనెల 20వ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడం జరిగింది. ఆపరేషన్ కగార్ ను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను జయప్రదం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ కూడా విడుదల అయింది.

అదే సమయంలో మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో AOB, తెలంగాణ అలాగే చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టుల బంద్ కొనసాగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది మావోయిస్టులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది పోలీస్ శాఖ. చర్చలకు వస్తామని కూడా మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వినడం లేదు.