ఆగస్టు 3న ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు

-

ఆంధ్రప్రదేశ్ లోని  విద్యార్థులకు బిగ్ అలెర్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జులై 02న నోటిఫికేషన్ విడదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 03వ తేదీనే గడువు ముగియనుందని ఏపీ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామ రాజు ఓ ప్రకటనలో వెల్లడించారు.

వాస్తవానికి ఇప్పటికే దరఖాస్తు ముగిసిపోయిందని.. దరఖాస్తు చేసుకునేందుకు ముగింపు తేదీని పొడగించడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత వరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్ లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్సలు అక్టోబర్ 03వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయని పాఠశాల విద్యాడైరెక్టర్ విజయ రామ రాజు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని టెట్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news