నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ నీ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్..!

-

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నారు. ఒకే రోజు ఒకే తరహా రోడ్డు ప్రమాదాలు రెండు చేసుకోవడం గమనార్హం. ఇవాళ ఉదయం ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో ఏకంగా 20 మంది వరకు గాయపడ్డారు. అందులో ఒక్కరు మరణించారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా  చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్నటువంటి  లారీని ఢీ కొట్టింది  సూళ్లూరుపేట ఆర్టీసీ బస్సు. దీంతో  ఒకరు మృతి చెందారు. ఇక  బస్సులో ఉన్నటువంటి మరో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  మరణించిన వ్యక్తిని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news