అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తాం – తమ్మినేని

-

అక్టోబర్ 1వ తేదీన కమ్యూనిస్టులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని తెలిపారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. గురువారం హైదరాబాద్ సిపిఎం కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన అంతా బిజెపి కోసమేనని.. బిజెపి కోసం ఎంఐఎం చాలా రాష్ట్రాలలో పోటీ చేసి ఓట్లు చీల్చిందని ఆరోపించారు. బిజెపికి సహకరించేలా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన ఉందని ఆరోపించారు తమ్మినేని.

ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బిజెపికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామన్నారు. ఇక బిజెపికి మహిళలంటే అభిమానం ఉంటే వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళా బిల్లు మంచిదే కానీ.. ఆ బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బందిగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news