రంగారెడ్డి జిల్లా నార్సింగీలో పోకిరీల హల్ చల్.. అకారణంగా తల్వార్లతో దంపతులపై దాడి..!

-

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థినిపై కొందరు పొకిరీలు ఆమెపై నీళ్లు పోసి అవహేళన చేశారు. అనంతరం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని తమ తల్లిదండ్రులకు పొకిరీ గురించి చెప్పగా.. వారు అక్కడికి వెళ్లి ఎందరుకిలా చేశారంటూ వారిని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ప్రవీణ్ అనే పోకిరీ తల్వార్తో విద్యార్థిని తండ్రి గొంతు కోశాడు.

అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోకిరీలు ప్రవీణ్, సురేష్లతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్-307, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పోకిరీల నుంచి నాలుగు తల్వార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news