అబ్దుల్లాపూర్ మెట్టులో రైతులపై కర్రలుతో దాడి చేసిన వెంచర్ నిర్వాహకులు..!

-

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు.. పిగ్లీ పూర్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పిగ్లీ పూర్ సర్వేనెంబర్ 17 లో సీలింగ్ లాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా స్థానిక రైతులు వచ్చి అడ్డుకున్నారు. దాంతో ఆ రైతులపై కర్రలు, రాలతో దాడి చేసారు వెంచర్ నిర్వాహకులు. అందులో పలువురు రైతులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన.. హాస్పిటల్ కు తరలించారు.

అయితే గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పటద్దారుల పై దాడి చేసాడు. మరోసారి ఈ పట్టాల దెగ్గరికి వస్తే చంపేస్తమని బెదిరించాడు. సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై, తమపై దాడులకు దిగడం అమానుష ఘటన అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ లను సృష్టించి అధికారులను తప్పు త్రోవ పట్టించారని బాధితులు పేర్కొన్నారు. అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగిన తమకి న్యాయం జరగడం లేదని వాపోతున్నారు బాధితులు.

Read more RELATED
Recommended to you

Latest news