Telangana: భార్యకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్

-

ప్రయాణికులు లేక.. గిరాకీ రాక.. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దింతో తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 36కి పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు.

ఇక తాజగా ఆటోలు నడుస్తలేవన్న బాధతో భార్యకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఆటో డ్రైవర్. నిజామాబాద్ – ఖిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలో నివాసం ఉండే స్వామి (45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా గిరాకీ లేక అటో నడవక మనోవేదనతో భార్య దేవలక్ష్మి (40) మెడకు తాడు బిగించి ఊరేసి, తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news