తెలంగాణలో నేటి నుంచి బడిబాట

-

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యంగా బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ్టి (జూన్ 6వ తేదీ) నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 3వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని విద్యా శాఖ తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తర్వాత దాన్ని 6వ తేదీకి వాయిదా వేసింది.

ఆ మేరకు తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా 11వ తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమాలు, బడులు పునఃప్రారంభమైన 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించింది. ఉత్తర్వుల నేపథ్యంలో బడి బాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దామని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version