బాలాపూర్ లడ్డూను మోడీకి అందజేస్తా- కొలను శంకర్ రెడ్డి

-

బాలాపూర్ లడ్డూను మోడీకి అందజేస్తానని ప్రకటించారు కొలను శంకర్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి.. బాలాపూర్ లడ్డు ఇస్తానని ప్రకటించారు. తాను బిజెపి పార్టీలోనే ఉన్నానని… అందుకే మోడీ కోసం ఢిల్లీకి వెళ్తానని వివరించారు.

Kolan Shankar Reddy Auctioned Balapur Laddu

మాజీ  సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నటువంటి కొలను శంకర్ రెడ్డి… ముందుగానే 30 లక్షల వరకు లడ్డు కొనుగోలు… ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు కొలను శంకర్. గతంలో 27 లక్షలకే ఈ లడ్డు వేలం పాటలో కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టారు కొలను శంకర్. అయితే… ఈ శంకర్ రెడ్డి అనే వ్యక్తి బిజెపి పార్టీకి చెందిన వాడుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా… బిజెపి లోనే కొనసాగుతున్నారు. ఈయనది కూడా బాలాపూర్ ప్రాంతమే కావడం విశేషం. అంటే లోకల్ వ్యక్తి బాలాపూర్ లడ్డు కొనుగోలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version